బండ్రెడ్డికి ఘనస్వాగతం పలికిన మల్లపరాజుగూడెం జనసైనికులు

పెడన నియోజకవర్గం, బంటుమిల్లి మండలం, మల్లపరాజుగూడెం గ్రామంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ పార్వతీ సమేత శివ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవానికి విచ్చేసిన కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణని భారీ ర్యాలీతో ఆహ్వానించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.