బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు: బొర్రా

సత్తెనపల్లి, భారత మాజీ ప్రధాన మంత్రి పీ.వీ నరసింహరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని, పీవీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు. అనంతరం పీవీ విగ్రహ కమిటీ సభ్యులు బొర్రాను దుశ్శాలువా, పూలమాలలతో బొర్రాను ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మన తెలుగు జాతికి చెందిన పీవీ నరసింహారావు భారతదేశ ప్రధానమంత్రిగా ఉండడం మనందరికీ ఎంతో గర్వకారణం. పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలని కొనియాడారు. రాజకీయంగా రాష్ట్రస్థాయి నుండి దేశ స్థాయికి అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తి మన పీవీ నరసింహారావు అన్నారు. దేశ రాజకీయాల్లో పీ.వీ నరసింహారావు చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావు, జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరావు, జిల్లా ప్రోగ్రాం కమిటీ నెంబర్ కేశవ, చిలకా పూర్ణ, ఘట్టు శ్రీదేవి ,ముప్పాళ్ళ మండల జనసేన నాయకుడు తిలక్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.