దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలిసిన వైసిపి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి: గునుకుల కిషోర్

కోవూరు నియోజకవర్గంలో పారుదల ఉండే కాలవలు లేవు, చక్కగా రోడ్లు ఉండే గ్రామాలు లేవు, మిమ్మల్ని ఆదరించే ప్రజలు లేరు,
రేపు మీకు ఓటు వేసే సామాన్యులు లేరు అంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ కోవూరు నియోజకవర్గం కొత్తూరు, హరిజనవాడలో స్థానికుల పిలుపు మేరకు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరిజనవాడలో మౌళిక వసతులు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాడలో ఎక్కడ కూడా కాలవలు లేవు, ఒకవేళ ఉన్న పారుదల లేక దుర్గధం వెదజల్లుతూ పాములు, పందులు, దోమల బెడదతో స్థానికులు విష జ్వరాలు భారిన పడుతున్నారు. గడపగడపకి వచ్చిన వైసీపీ ప్రసన్న వారి బాధలు విన్నారే గాని పరిష్కరించే మార్గాలు చూపలేకపోయారు. గత ప్రభుత్వాలు ఎక్కడైతే అభివృద్ధిని నిలిపివేశారో అక్కడి నుంచి అడుగు కూడ కదల్లేదు. గత ప్రభుత్వాలు వేసిన రోడ్లు తర్వాత ఏ విధమైన అభివృద్ధి పనులు కూడా జరగలేదు. వెనుకబడిన తరగతుల వారికి 200 యూనిట్లు లోపల ఉచితంగా ఇవ్వాల్సి వస్తుంది అదే పలమార్లు 200 యూనిట్లు లోపల వస్తే మీటర్లు మార్చి 200 యూనిట్లు దాటిస్తున్నారు. అమ్మఒడి 15000 ఇవ్వాల్సింది ఉండగా కొందరికి 13000 కొందరికి ఎనిమిది వేలు రకరకాలుగా మార్చి ఇస్తున్నారు స్థానిక వైసీపీ పెత్తందారులు. ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని మారిస్తే తప్ప అభివృద్ధి జరగదు తమ సమస్యలు తీరవు అనే ఒక నిర్ణయానికి వచ్చారు. దోచుకోవడం దాచుకోవడం మాత్రమే తెలిసిన వైసిపి వైసిపి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి. రానున్నది ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమే మీ సమస్యలన్నింటినీ కూడా స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.. పరిష్కారం అయ్యే దిశగా జనసేన పార్టీ మీకు మద్దతుగా ఉంటుంది. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇచ్చి ప్రజా ప్రభుత్వం స్థాపనకు ప్రజలందరూ ముందుకు రావాలి. ముఖ్యంగా హరిజనవాడలు అభివృద్ధికి నోచుకోలేక దుర్బరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన అనంతరం వారి సమస్యలను తీర్చేందుకు ప్రయత్నిస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, వర్షన్, బన్నీ, వరా, కేశవ, మౌనిష్ పవన్ తో స్థానిక జనసేన మద్దతుదారులు పాల్గొన్నారు.