గంటా వరప్రసాద్ కు నివాళులర్పించిన బత్తుల

రాజమండ్రి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి & జనసేన పార్టీ వీరమహిళ శ్రీమతి గంటా స్వరూప దేవి భర్త గంటా వరప్రసాద్ ఇటీవల స్వర్గస్తులైన కారణంగా సోమవారం రాజమండ్రి సూర్య గార్డెన్స్ నందు జరిగిన పెదకార్యం కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి నమస్కరించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను కలిసి మనోధైర్యం కల్పించడమే గాక జనసేన పార్టీ తరుపున మేమందరం మీకు అండగా ఉంటామని రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.