కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేనలో చేరిన యువకులు

తాడిపత్రి, జనసేన పార్టీ సిద్దాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దవడుగురు మండలం అప్పెచర్ల గ్రామానికి చెందిన 20 మంది యువకులు దూద్ బాషా, బాబాఫకృద్దిన్, రాజేంద్ర, రాజు, హజి, రంగా తదితరులు తాడిపత్రి పట్టణం పుట్లూరు రోడ్డులో గల ఆర్డిటీ రూములకు ఎదురుగా ఉన్న స్థానిక పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారికి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సఅందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ యువకుల కోసం, యువత భవిషత్తు కోసం నిరంతరం కృషి చేస్తుందని ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యం అని కార్యకర్తలకు తెలియజేశారు. అదేవిధంగా పార్టీ సిద్దాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తోడుగా ఉంటానని శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి నియోజకవర్గ నాయకులు కిరణ్ కుమార్, అయుబ్, రసూల్, మణికంఠ, కొండా శివ, రాహూల్, సుదర్శన్, రమణ, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.