టీడీపీ సీనియర్ నేత నంగిరెడ్డి విష్ణుని మర్యాదపూర్వకంగా కలిసిన బత్తుల

రాజనగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో టిడిపి సీనియర్ నేతలు నంగరెడ్డి విష్ణుని మర్యాదపూర్వకంగా కలిసిన రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ. ఇరువురి మధ్య రాజకీయ చర్చలతో పాటు భవిష్యత్ కార్యాచరణ పలు అంశాల మీద ఈ సమావేశం జరిగింది. అనంతరం బూరుగుపూడి జనసైనికులతో మాటామంతి కలిపి ప్రస్తుత పరిస్థితులను గురించి బలరామకృష్ణ చర్చించారు. ఈ సమావేశంలో జనసేన శ్రేణులు చక్రి, వీరబాబు, ముని ప్రసాద్, కట్టా సూరి, రంగా అడపా ముని, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.