తుది దశకు యువశక్తి సభ ఏర్పాట్లు

జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరగనున్న యువశక్తి సభకు ప్రాంగణం సిద్ధమైంది. స్టేజ్ నిర్మాణం, బారికేడింగ్, భద్రత ఏర్పాట్లు పూర్తయ్యాయి. అన్ని రకాల భద్రత పరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. గత నాలుగు రోజులుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్వయంగా దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంగళవారం ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో మరోసారి ప్రధాన వేదిక, ప్రాంగణం మొత్తం తిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. సభా ప్రాంగణానికి తుది మెరుగులు దిద్దేందుకు వీలుగా కార్యక్రమాల నిర్వహణ విభాగానికి పలు సూచనలు చేశారు. రణస్థలం యువశక్తి సభ ఏర్పాట్లను మంగళవారం శ్రీకాకుళం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి జి.ఆర్.రాధిక పరిశీలించారు. సభాస్థలి వద్ద నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. సభా నిర్వహణ కమిటీకి కొన్ని సూచనలు చేశారు.