అంగన్వాడీల దీక్షకు బోనబోయిన సంఘీభావం

గుంటూరు: కలెక్టరేట్ వద్ద జరుగుతున్న అంగన్వాడీ న్యాయపరమైన కోరికల కోసం చేస్తున్న దీక్షకు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే వీరి సమస్యల్ని పరిష్కరించాలని, క్రమశిక్షణతో కలిగిన టీచర్స్ లను రెగ్యులర్ చేయాలని, వారి న్యాయమైనా కోరికలను తక్షణమే తీర్చాలని జనసేన పార్టీ తరఫున బలంగా కోరుకున్నారు. వారి సమస్యను తీర్చని యెడల ఈ కార్యక్రమాన్ని మరికొంత ఉద్రికతను జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి అంగన్వాడి టీచర్లతో రాష్ట్రవ్యాప్తంగా సమ్మెను పిలుపునిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఆడప మాణిక్యాలరావు, బిట్రగుంట మల్లికా, ప్రధాన కార్యదర్శి కొప్పుల కిరణ్, నారదాసు రామచంద్ర ప్రసాద్, వార్డు ప్రెసిడెంట్లు, సిటీ కమిటీ మెంబర్లు, మహిళలు మరియు జనసైనికులు భారీగా పాల్గొనడం జరిగింది.