నాదెండ్ల మాట కాకినాడ సిటీలో అందరి నోట

కాకినాడ సిటీ: జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాలతో నాదెండ్ల మనోహర్ మాట కాకినాడ సిటీలో అందరి నోట కార్యక్రమం 41వ డివిజన్ రైతుబజార్ సెంటర్ వద్ద వాశిరెడ్డి సత్యకుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ నేడు రాష్ట్రం ఇంతలా నాశనం అయిపోడానికి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతే ప్రధాన కారణం అని ఆరోపించారు. ఆవుచేలో మేస్తూంటే దూడ గట్టున మేస్తుందా అన్న చందాన మిగతా నాయకులు కూడా ఎవరి జేబు ఎలా నింపుకోవాలా అని దొరికిన కాడికి దోచేస్తున్నారనీ, అవినీతిని ప్రశ్నిస్తే దొంగకేసులు బనాయించి నోరుమూయాలని చూస్తున్నారన్నారు. ఆఖరికి మొన్నటికి మొన్న నాదెండ్ల మనోహర్ గారు చెప్పినట్టు కేంద్ర పధకం సర్వశిక్షా అభియాన్ లోని నిధులలో కూడా చేతివాటం చూపించారన్నది తెలిసి ప్రజలు నివ్వెరపోతున్నారన్నారు. ఈ ముఖ్యమంత్రి పధకాలు అని పైకి చెపుతూ ఆపేరుతో తన జేబు నింపుకోడమే అసలు పధకం అని ప్రజలకు కూడా తెలిసిందనీ అందుకే ఈ నాలుగున్నర ఏండ్లలో తెచ్చిన లక్షలాది కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పకుండా మొహం చటేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ అవినీతి వై.సి.పి ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికలలో ఓడించి జనసేన తెలుగుదేశం పార్టీల కూటమికి మద్దతునిచ్చి ప్రజల ఓటు విలువని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం.టి బ్రహ్మాజీ, వి.వి సత్యన్నారాయణ, నూకరాజు, ఎస్. వెంకట రమణ, వై.శ్రీను, ఎం. సూరిబాబు, ఎస్. సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.