దారుణాలకు పాల్పడుతున్న వాలెంటీర్ల గురించి మాత్రమే జనసేనాని ప్రస్తావించారు

  • సత్య సాయి జిల్లా జనసేన కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల

కదిరి: ఓ తెగ రోషం వచ్చేస్తోంది ఈ జగన్ రెడ్డి సైన్యానికి, మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన వారాహి యాత్ర విజయవంతం కావడం, ప్రజల్లో జనసేన పార్టీ పట్ల పవన్ కళ్యాణ్ గారి పట్ల ఆదరణ లభిస్తుండడం చూసి ఓర్వలేని నిరంకుశ పాలకులు మా అధినేతను విమర్శించడం కోసం ప్రెస్ మీట్ లో తెగ బాధపడి పోతున్నారుని సత్య సాయి జిల్లా జనసేన కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆధారాలు లేనిదే విమర్శ చెయ్యరని మొన్న కాకినాడ వారాహి యాత్ర భహిరంగ సభలోనే తేట తెల్లం అయిపోయింది. మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు లేక తెలియక వాలెంటిర్ వ్యవస్థను అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. మా అధినేత ఎవరైతే ఈ వాలెంటిర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని దోపిడీకి, అత్యాచారాలకు పాలపడుతున్నారో వారి గురించి మాత్రమే ప్రస్తావించారు తప్ప మొత్తం వాలెంటిర్ల గురించి మాత్రం మాట్లాడలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఆలోచన చెయ్యకుండా కేవలం అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే విమర్శించడం కోసం మీడియా ముందుకు వస్తున్నారు. మీకు పవన్ కళ్యాణ్ గారి ఫోబియా పట్టుకుంది రాబోయే ఎన్నికల్లో మీకు అధికారం దూరం అవ్వడం ఖాయం. రాష్ట్రంలో మీ పరిపాలనలో చేసిన అభివృద్ది శూన్యం. గమనిక: దారుణాలకు పాల్పడుతున్న వాలెంటీర్ల గురించి మాత్రమే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆకోవలో మీరు లేరు అనుకుంటే స్వార్థ పూరిత రాజకీయ నాయకుల చేతుల్లో పావులు అవ్వకండి. మీ పట్ల అంత చిత్తశుద్దే జగన్ రెడ్డికి ఉండి ఉంటే మీకు ఇచ్చే వేతనం పెంచేవారు అలా చెయ్యలేదు అంటే మిమ్మల్ని వారి పనుల కోసమే వాడు కుంటున్నారని గ్రహించండి అని లక్ష్మణ కుటాల తెలిపారు.