జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ కేసులపై విచారణ
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ నమోదు చేసిన కేసులపై ఈరోజు సీబీఐ కోర్టులో విచారణ జరుగనుంది. జగన్ కేసులో ఈడీ, సీబీఐ కేసులను వేర్వేరుగా విచారణ జరపాలన్న అంశంపై నేడు న్యాయస్థానం విచారణ చేయనుంది. సీబీఐ కేసులో జగతి పబ్లికేషన్స్ చార్జ్ షీట్లో డిశ్చార్జ్ పిటిషన్పై వాదనలు కొనసాగాయి. సీబీఐ చార్జ్ షీట్లపై ఈనెల 9న విచారణ చేయనున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.