దుప్పాడ, రాకోడు గ్రామాలలో జనసేనలో భారీ చేరికలు

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర జనసేన టీడీపీ సమన్వయ కమిటీ సభ్యురాలు మరియు విజయనగరం నియోజకవర్గం ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో విజయనగరం నియోజకవర్గంలోని దుప్పాడ, రాకోడు గ్రామాలనుంచి సుమారుగా 30 మంది గ్రామస్థులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీమతి పాలవలస యశస్వి వారికి సాదరంగా స్వాగతం పలుకుతూ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన పార్టీ విజయనగరం మండలం ఇంచార్జి బొబ్బది చంద్రు నాయుడు సహకారంతో ఈ కార్యక్రమం విజవంతంగా స్థానిక పాల్నగర్, జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా నాయకులు శ్రీ అదాడ మోహన్ రావు, డ. మురళి మోహన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.