బిటీ కళాశాలలో జగన్ రెడ్డికి పాలాభిషేకం ఎంతవరకూ సమంజసం?

మదనపల్లె: బిటీ కళాశాలలో గురువారం ఎంపీ మిథున్ రెడ్డికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులు పాలాభిషేకం చేయడం ఎంత వరకు సమంజసం అని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో సిపిఐ మురళి, ఆర్జె వెంకటేష్, జనసేన నాయకులు కార్యకర్తలు, వీరమహిళలతో కలసి ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ని ప్రశ్నించడం జరిగింది. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, మాట, నడవడిక అంత కుట్ర పూరితమే అని ఎంపీ మిథున్ రెడ్డి గారు బిటీ కళాశాల ప్రభుత్వం పరం చేసేశామని ప్రజలని తప్పు దోవ పట్టించారు, డిగ్రీ కళాశాల ని ప్రభుత్వం పరం చేయకనే యూనివర్సిటీ చేసేశామని ప్రజలని, పూర్వ విద్యార్థులని, పత్రికాలోకాన్ని, రాజకీయా పార్టీలని మోసం చేస్తు, ఈ రోజు దుర్మార్గంగా పరమ పవిత్రమైన బెసెంట్ హల్ లో ఎంపీ, సీఎం లకి పాలాభిషేకం చేయడం జనసేన పార్టీ తరుపున తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ఇది కేవలం ఎలక్షన్ కోసం మిథున్ రెడ్డి ఆడుతున్న నాటకమని, అంత పచ్చి మోసం అని, అబద్దం అని, మదనపల్లి ప్రజానీకాన్ని, యావత్ ప్రపంచాన్ని మోసం చేస్తున్నరని దీనిని పెద్ద ఎత్తున జనసేన, తెలుగుదేశం, సిపిఐ పార్టీలు కలసి అందోళన చేస్తామని అవసరమైతే పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకొని వెళ్తామని అన్నారు.ఈ కార్యక్రమం లో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఆర్జె వెంకటేష్, సిపిఐ మురళి, జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ సనా ఉల్లా, గజ్జల రెడ్డెప్ప, రూరల్ మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు, పట్టణం ప్రధాన కార్యదర్శి కావలి రెడ్డెమ్మ, సరోజ, పట్టణ సెక్రటరీ నాగవేణి, జంగాల గౌతమ్, గండికోట లోకేష్, రూరల్ మండల ఉపాధ్యక్షులు చంద్రశేఖర, కుమార్, లవన్న, రాజారెడ్డి, రూరల్ సెక్రటరీ జనార్దన్, నరేష్, విజయ్ కుమార్, గంగులప్ప తదితరులు పాల్గొన్నారు.