క్యాన్సర్ బాధితులకు బలగ వైకుంఠరావు ఆర్థిక భరోసా

పెందుర్తి: కవిటి మండలలోని ప్రగడ పుట్టుగ గ్రామానికి చెందిన యాండ్రాపు చిరంజీవి అంజిలి దంపతుల ముద్దుల కుమార్తె 9 నెలల చిన్నారి బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ విశాఖపట్నంలో గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకొని శనివారం జన్మదిన సందర్భంగా పెందుర్తి నాయకులు బలగ వైకుంఠ రావు పవన్ పుత్ర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వారి కుటుంబానికి ఆర్థిక భరోసాతో పాటు భవిష్యత్తులో మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నానా నుంచి మా పార్టీ నుంచి మీకు ఉంటాయని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు మజ్జి భాస్కరరావు, జనసేన పార్టీ నాయకులు కంచిపాటి మధు, వబ్బిన జనార్ధన శ్రీకాంత్, మెండా సతీష్ పాల్గొన్నారు.