కిచ్చప్ప గూడెం గ్రామంలో జనం కోసం జనసేన 104వ రోజు

పోలవరం నియోజకవర్గం: కొయ్యలగూడెం మండలం, దిప్పకాయలపాడు పంచాయతి కిచ్చప్ప గూడెం గ్రామంలో జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా 104వ రోజు మండల అధ్యక్షుడు తోట రవి గ్రామ అధ్యక్షుడు, గ్రామ అధ్యక్షులు కరుకు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో చిర్రి బాలరాజు ఇంటింటికి తిరిగి వారి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే సరైన రోడ్డు వసతి లేదు డ్రైనేజ్ అధ్వానంగా ఉంది గ్రామస్తులు చిర్రి బాలరాజుకి తెలియపరిచారు. ఈ సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్తానని ఆయన వారికి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే జనసేన పార్టీ విధివిధానాలు మేనిఫెస్టో గురించి వారికి వివరించడం జరిగింది. నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన తెల్లం బాలరాజు ఒకసారి కూడా గ్రామానికి వచ్చి వారి సమస్యల గురించి పట్టించుకున్నది లేదని, జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే మీ ఇంట్లో వాడిగా పని చేస్తానని, రాష్ట్ర భవిష్యత్తు పిల్లలు భవిష్యత్తు మన చేతుల్లోనే ఉన్నదని ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలని, మన కష్టాలకి మనమే పరిష్కారం వెతుక్కోవాలంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సమూలంగా నిర్మిలించాలని ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కొయ్యలగూడెం పట్టణ అధ్యక్షులు మాదేపల్లి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి ప్రగడ రమేష్, పండు, రామదండు, విరోతూ వీర్రాజు, ఏ శ్రీను, ఎం. సాయి, రఫీ తదితరులు పాల్గొన్నారు.