తెలంగాణలో ఘనంగా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ దస్పల్లా హోటల్లో తెలంగాణ రాష్ట్ర నాయకులు ఘనంగా ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్.కె సాగర్ మరియు జనసేన పోలీట్బ్యూరో సభ్యులు అర్హం ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆర్.కె సాగర్ జనసేన పార్టీ నాయకులకు, వీరమహిళలకు, జనసైనికులకు 11వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 11 ఆవిర్భావ సభ తెలంగాణలో జరుపుకోవడం ఆనందంగా ఉంది అన్నారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని చూసి వారి భావజాలం నచ్చి జనసేన పార్టీలో చేరడం జరిగిందన్నారు. తన చిన్నతనంలో తరచూ ఒక మాట వినేవాణ్ణి అని, ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడానికి అన్నలు వస్తారు అని చెప్తుండే వారు కానీ ఇప్పుడు కష్టం వస్తే తీర్చడానికి అన్నలు లేరు కానీ ప్రజలకు కష్టం వస్తే తీర్చడానికి పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన భావజాలంతో ఉన్న జనసైనికులు ఉన్నారు అని అన్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇలాంటి సభలు భవిష్యత్తులో జరుపుకుందాం అన్నారు.ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ కోసం పండించిన రెండు పాటలను ఆర్.కె సాగర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ దామోదర్ రెడ్డి వివిధ నియోజకవర్గ ఇంచార్జిలు మాధవ రెడ్డి, రామకృష్ణ, నందగిరి సతీష్, మాయ రమేష్, నగేష్, పృథ్వి, తగరపు శ్రీనివాస్, రామలింగం తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు సురేష్ రెడ్డి, పరవేక్షణ సభ్యులు లిఖిత మరియు ముఖ్య నాయకులు ఆబీద్, రావుల మధు, సాంబ శివ, పెంటల మహేష్, ఉదయ్ రెడ్డి వీరమహిళలు, జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు మరియు జనసైకులు పాల్గొన్నారు.