వారాహి యాత్ర విజయవంతం కావాలి: యల్లటూరు శ్రీనివాసరాజు

రాజంపేట: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టబోయే నాలుగవ విడత వారాహి యాత్ర విజయవంతం కావాలని రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు డిఆర్డిఏ మాజీ రాష్ట్ర అధికారి యల్లటూరు శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు ఆయన తమ్ముడు మాజీ జెడ్పిటిసి యల్లటూరు శివరామరాజు మరియు రాజంపేట జనసేన నాయకులు కార్యకర్తలు వారాహి యాత్ర విజయవంతం కావాలని శుక్రవారం మన్నూరు శ్రీ యల్లమ్మ దేవాలయంలో యల్లమ్మ తల్లి ఆశిస్సుల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పి.వి.ఆర్ కుమార్, చిట్టే బాస్కర్, పత్తి నారాయణ, మౌల, రాజ ఆచారి, నాసర్ ఖాన్, సాయి రాజు, మురళిధర్ రాజు, కట్టారు బాబు, చింతల శివ, నాని, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.