సర్వేపల్లిలో 12వ రోజు జనంకోసం జనసేన

సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, బ్రహ్మదేవం గ్రామం నందు 12వ రోజు అదివారం జనం కోసం జనసేన కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ అభివృద్ధి లేని సర్వేపల్లి నియోజకవర్గం ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి నాలుగు సంవత్సరాల నుంచి అధికారపక్షంలో ఉంటూ ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోగా, ప్రజా సమస్యలను పట్టించుకోక పోగా ఎవరైనా మా గ్రామాలలో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించండి అని చెప్పి వాళ్ళు విన్నవిచ్చుకుంటే వాళ్లపైన అక్రమ కేసులు పెట్టే పరిస్థితి. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు కల్లబల్లి మాటలతో కాలయాపన చేస్తూ కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారే తప్ప నియోజకవర్గాన్ని అభివృద్ధి అనే మాటకి అర్థం లేకుండా పోయినట్టుగా ఉంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా పేరుకు మాత్రం సర్వేపల్లి నియోజకవర్గం. సర్వేపల్లి నియోజకవర్గంలోని కృష్ణపట్నం పోర్టు పరిశ్రమలు, ఆయిల్ కంపెనీలు, పవర్ ప్లాంట్ లు ఎన్నో ఉన్న అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టుగా నియోజకవర్గ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే ఒక జనసేనతోనే సాధ్యం అని సురేష్ నాయుడు. ఈ కార్యక్రమంలో మోతుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, అక్బర్, చిన్న, శ్రీహరి, ఖాదర్, బాషా గౌస్, రెహమాన్, కార్తికేయ, శశి, దుర్గా, చరణ్, మనోహర్, తదితరులు పాల్గొన్నారు.