155వ రోజు జనం కోసం జనసేన మహాపాదయాత్ర

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, జి.యర్రంపాలెం గ్రామంలో శనివారం జనం కోసం జనసేన మహాపాదయాత్ర 155వ రోజు కార్యక్రమాన్ని.. శనివారం ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ మహాపాదయాత్రలో పాల్గొన్న జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి జి.యర్రంపాలెం ప్రజలు హారతులు పడుతూ అఖండ స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ ప్రతీ ఒక్కరినీ కుటుంబ సభ్యుల వలే ఆప్యాయంగా పలకరిస్తూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మన జీవితాల్లో వెలుగులు నింపగలరని 2024లో ఒక్క అవకాశం ఇవ్వండి అని అభ్యర్థించి జనసేన పార్టీ కరపత్రం, కీ చైన్, బ్యాడ్జ్ అందజేశారు. అనంతరం గ్రామానికి చెందిన ఎస్.సి నాయకులు శ్రీ కమిడి నానిని జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి బత్తుల వెంకటలక్ష్మి సాధారంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.