RITES 170 ఇంజినీర్ పోస్టులు
రైల్వే శాఖ పరిధిలోని మినీరత్న కంపెనీ అయిన రైట్స్ (ఆర్ఐటీఈఎస్)లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 170 పోస్టులను భర్తీ చేయనుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 170
ఇందులో సివిల్ ఇంజినీర్- 50
ఎలక్ట్రికల్ ఇంజినీర్-30
మెకానికల్ ఇంజినీర్-90
అర్హత: బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీలో సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ లేదా ప్రొడక్షన్ లేదా ఇండస్ట్రియల్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి. రెండేండ్ల అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష (60 శాతం), ఇంటర్వ్యూ (35 శాతం), అనుభవం (5 శాతం) ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 26
వెబ్సైట్: http://www.rites.com