ఆమదాలవలసలో జనంతో జనసేన 18వ రోజు
ఆమదాలవలస నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్(ఎంపీటీసీ) నాయకులు మరియు కార్యకర్తలు ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో జనంతో జనసేన కార్యక్రమంలో భాగంగా 18వ రోజు, కోనము పేట గ్రామంలో నిర్వహించడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలను మరియు రాష్ట్రములో గతంలో మరియు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ప్రజలను ఏ విధంగా, మభ్యపెట్టి మోసం చేస్తున్నాయో, ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితాలు బాగుండాలి, యువత అందరికి కూడా జాబులు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించి, గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరుపేరునా మనవి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొత్తకోట శ్రీను, సైరుగాపు సంతోష నాయుడు, వినోద్, పి ప్రసాద్, మోహన్, కిరణ్, ప్రదీప్ మరియు జనసేన కార్యకర్తలు కోనం పేట గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాములు తెలియజేసుకుంటున్నామని తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-08-at-13.21.54-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-08-at-13.21.53-1024x470.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/09/WhatsApp-Image-2022-09-08-at-13.21.52-1024x576.jpeg)