వినాయక చవితి అన్నదాన కార్యక్రమంలో మార్కండేయ బాబు

గుంటూరు, ప్రత్తిపాడు, బాలాజి నగర్ 10వలైన్ లోని ఏకదంత ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో గురువారం వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, గుంటూరు పట్టణ కార్యదర్శి తోటి కార్తిక్, పట్వణ సంయుక్త కార్యదర్శి పి.ఫణి కుమార్, కారుమంచి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత తొమ్మిది రోజులుగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా మార్కండేయ బాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని తోట కార్తిక్ మిత్రబృందం అనేక వ్యయప్రయాసలతో చాలా చక్కగా నిర్వహించటం అభినందించదగ్గ విషయం అని అన్నారు.