జనసేన ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం 19వ రోజు

వైజాగ్ ఈస్ట్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో విశాఖ తూర్పు నియోజకవర్గం, 15వ వార్డు జనసైనికుడు పచ్చితాల సాయిబాబా ఆధ్వర్యంలో గత 19రోజులుగా దిగ్విజయంగా చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. కార్యక్రమంలో భాగంగా మంగళవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ.. 15వ వార్డు నందు నివసిస్తున్న ప్రజలు మరియు తూర్పు నియోజకవర్గ ప్రజలు వచ్చి జనసేన పార్టీని ఆశీర్వదించి మరియు జనసేన పార్టీ గురించి వారు చెప్పిన మాటలు విని చాలా సంతోషదాయకంగా అనిపించింది. అలాగే ఈరోజు 22 వార్డు తూర్పు నియోజకవర్గ జనసేన నాయకులు జయ నాయుడు గారు విచ్చేసి మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే నా మిత్రులు దుర్గా నగర్ నుంచి విచ్చేసిన 15వ వార్డు నాయకులు బుజ్జి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సాయిబాబా ధన్యవాదాలు తెలిపారు.