డి ఎర్రవరం గ్రామం నుండి 20 మంది యువకులు జనసేనలో చేరిక

నర్సీపట్నం, జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజన్న వీర సూర్య చంద్ర సమక్షంలో నాతవరం మండల అధ్యక్షుడు మల్లాడి శ్రీను, మండల ప్రధాన కార్యదర్శి బైన మురళి, సీనియర్ నాయకులు మంగళ భాస్కర్ జనసేన పార్టీలోకి చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సూర్య చంద్ర మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికలలో జనసేన జెండా ఎగిరే విధంగా గ్రామగ్రామాన ఉన్న యువకులు మరింత ఉత్సాహంతో జనసేన పార్టీలో చేరుతున్నారని ఇది మంచి శుభ పరిణామమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మంగళ భాస్కర్ మరియు రేగుపండ్ల శివ మాట్లాడుతూ… అత్యంత యువత ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ యువత ఉత్సాహంతో ఉద్యోగ వ్యాపార లతో పాటుగా రాజకీయాలలో కూడా చైతన్యంతో ఉండటం చాలా శుభపరిణామమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మల్లాడి శ్రీను, మురళి, నవీన్ మాట్లాడుతూ రాబోయే రోజులలో పార్టీ బలోపేతం మరింతమంది యువతని జనసేన పార్టీలో చేరే విధంగా గ్రామ గ్రామ పర్యటన చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తామని, రాబోయే ఎన్నికలలో జనసేన జెండా ఎగిరే విధంగా పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ అరుణ్ కుమార్, వరహాలు బాబు, రమేష్, చిన్న, లక్ష్మీకాంత్, ప్రసాద్, అజయ్ ప్రసాద్, సంతోష్, పి స్వామి పాల్గొన్నారు.