జనసేన ప్రజా చైతన్య యాత్ర 20వ రోజు

బొబ్బిలి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్షంగా, విజయనగరం జిల్లా, బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ డా. గిరాడ అప్పలస్వామి జనసేన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా “ఆంధ్రా జనం – పోయాం మోసం” 20వ రోజు కార్యక్రమాన్ని బొబ్బిలి మండలం గున్నతోటవలస గ్రామంలో ఇంటింటా ప్రచారం చెయ్యడం జరిగంది. బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ డా. గిరాడ అప్పలస్వామి సమక్షంలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీ ని ముందుకు నడిపిస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కరానికి హామీ ఇస్తూ, ప్రభుత్వం పై పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తు ముందుకు వెళ్తున్నారు, ఈ కార్యక్రమంలో జనసైనికులు మరియు బొబ్బిలి నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.