క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేసిన లక్ష్మునాయుడు

ఎచ్చెర్ల నియోజకవర్గం: రణస్థలం మండలం, కృష్ణాపురం పంచాయతీ జనసేన పార్టీ నాయకులు మరియు క్రియాశీలక వాలంటీర్ పోట్నూరు లక్ష్మునాయుడు అధ్వర్యంలో గురువారం క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న సభ్యులకు సభ్యత్వ కార్డులు అందజేసారు. మహాంతి శ్రీరాములు, ముప్పిడి శ్రీరాములు, నడుపూరి రామకృష్ణ, జనార్ధనరావు, కలిశెట్టి చిన్నంనాయుడు, వీరమహిళ పిన్నింటి విజయ తదితరులకు కిట్లు అందజేయడం జరిగింది.