మదనాపురంలో జనంతో జనసేన 20వ రోజు

ఆమదాలవలస, నియోజకవర్గ జనసేన నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్(ఎంపీటీసీ) నాయకులు మరియు కార్యకర్తలు ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో జనంతో జనసేన కార్యక్రమంలో భాగంగా 20వ రోజు కొల్ల జయరాం, మదనాపురం గ్రామం నాయికులు రుంకు అనంత మరియు కార్యకర్తల సహకారంతో ప్రతి ఇంటింటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలను మరియు రాష్ట్రాములో గతంలో మరియు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ప్రజలను ఏ విధంగా, మభ్యపెట్టి మోసం చేస్తున్నాయో, ప్రజలకి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితాలు బాగుండాలి, యువత అందరూ కి కూడా జాబులు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించి, గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరుపేరునా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కొల్ల జయరాం, రుంక్ అనంత, పొట్నూరు రమేష్, జనసేన జానీ, ప్రశాంత్, కొత్తకోట శ్రీను, సైరుగాపు సంతోష నాయుడు, పి ప్రసాద్, మోహన్, కిరణ్ మరియు జనసేన కార్యకర్తలు మదనాపురం గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరినీ పేరు పేరునా ధన్యవాదాములు తెలియజేసుకుంటున్నామని తెలిపారు.