జనంకోసం జనసేన 275వ రోజు

  • వనరక్షణలో భాగంగా 800 మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 275వ రోజులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో జనసేన వనరక్షణ దానిమ్మ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో జరిగింది. కార్యక్రమంలో భాగంగా మంగళవారం 800 దానిమ్మ మొక్కలు పంచడం జరిగింది. ఈనాటికి మొత్తం 41800 దానిమ్మ మొక్కల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అద్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల ఎస్సి సెల్ అధ్యక్షులు బీడీల రాజబాబు, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, కాట్రావులపల్లి నుండి గ్రామ ఉపాధ్యక్షులు చిట్టీడి రామారావు, బంగారు రామస్వామి, నార్ల దిని నారాయణ, షేక్ రెహమాన్, రామకుర్తి బాలు, తోలాటి రాజు, చిట్టీడి సూర్యనారాయణ, చిట్టీడి శివ రామ్, సోడాబత్తుల సత్యనారాయణ, యడల సత్తిబాబు, కర్రి బాబ్జి, సూరిసెట్టి గంగాధర్, వెంగయ్యమ్మపురం నుండి మరిశే వెంకటేష్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.