ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం కార్యక్రమం 28వ రోజు

సర్వేపల్లి: ఆంధ్రా అభివృద్ధి జనసేనతోనే సాధ్యం కార్యక్రమంలో భాగంగా ముత్తుకూరు మండలంలోని, వల్లూరు హరిజన వాడ గ్రామంలో జనసేన నాయకులు ఇంటింటికీ కరపత్రాలు పంచారు. జనసేన నాయకులు మనుబోలు గణపతి మాట్లాడుతూ రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీ ఉంది. రాబోవు ఎన్నికలలో సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు. ఈసారి పవన్ కళ్యాణ్ ని సీఎం ని చేసుకుంటేనే రాష్ట్రాభివృద్ధి జరుగు తుందని, రాబోవు సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీ గుర్తు అయిన “గాజుగ్లాసు” కు ఓటు వేసి జనసేన పార్టీకి అధికారం ఇవ్వండి అంటూ తెలియజేసారు. ఈ కార్యక్రమం జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో తాండ్ర శ్రీను, అన్నిమేటి వెంకయ్య పాల్గొన్నారు.