28వ తేదీ కూకట్ పల్లి నియోజకవర్గంలో శ్రీ పవన్ కళ్యాణ్ రోడ్ షో

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారం చివరి రోజున జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో నిర్వహణకు సన్నాహాలు పూర్తయ్యాయి. 28వ తేదీ మంగళవారం మధ్యాహ్నం కూకట్ పల్లి నియోజకవర్గంలో రోడ్ షో ఉంటుంది. బాలానగర్ నుంచి హస్మత్ పేట అంబేడ్కర్ విగ్రహం వరకూ సాగుతుంది. మధ్యాహ్నం 2 గం.కు బాలానగర్ చౌరస్తా నుంచి మొదలవుతుంది. న్యూ బోయిన్ పల్లి సిగ్నల్ క్రాస్ నుంచి వయా బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ మీదుగా ఓల్డ్ బోయిన్ పల్లి చెక్ పోస్ట్, హస్మత్ పేట బస్టాప్, అంబేడ్కర్ విగ్రహం వరకూ ఈ యాత్ర సాగుతుంది. అక్కడ ప్రజలను ఉద్దేశించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థిగా శ్రీ ముమ్మారెడ్డి ప్రేమకుమార్ బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో జనసేన – బిజెపీ ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయనున్నారు.