గాడాల గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర 2వ రోజు

రాజానగరం: కోరుకొండ మండలం గాడాల గ్రామంలో 2వ రోజు నా సేన కోసం నా వంతు కో- ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి సారథ్యంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర అట్టహాసంగా నిర్వహించడం జరిగింది. రెండవ రోజు మహాపాదయాత్రలో తగ్గని జోరు.. బ్రహ్మరధం గ్రామ ప్రజానీకం పట్టారు. పాదయాత్రకు భారీగా తరలివచ్చిన వీరమహిళలు. గాడాల గ్రామ ప్రజలు తమపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు ఎంతగానో రుణపడి ఉంటామని తెలియజేసిన బత్తుల. పాదయాత్రలో భాగంగా ప్రతీ ఇంటికీ వెళ్ళి ప్రతీ ఒక్కరినీ పలకరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే రోజుల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించుకుని ప్రజా పరిపాలన తెచ్చుకుందాం. అని తెలియజేసి జనసేన పార్టీ కరపత్రాన్ని అందజేశారు. ఇంతటి ఆదరణ, ఆప్యాయత ఒక్క జనసేన పార్టీకి మాత్రమే సొంతం. ఈ కార్యక్రమంలో గాడాల జనసేన సీనియర్ నాయకులు అడ్డాల శ్రీను, అడ్డాల శివ సూర్య చక్రవర్తి, గాదంశెట్టి వెంకన్న, మణ్యం శ్రీను, పడాల అనీష్, మాదారపు శ్రీనివాస్ (ఆలి), మాగాపు నాగేశ్వరరావు, మాగాపు సత్యనారాయణ, కన్నెం శ్రీను, బంటుపల్లి ఏసు, మట్ట గణేష్, అత్తిలి గోపి, నార్ని నారాయణరావు, పడాల అనీష్, గాడాల జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, మండల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.