50 ఓవర్లలో 336 పరుగులు.. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్..

ఇంగ్లాండ్ ముందు టీమిండియా మరోసారి భారీ టార్గెట్‌ను ఉంచింది. పుణేలో జరుగుతున్న రెండవ వన్డేలో భారత్‌.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 336 రన్స్ చేసింది. మిడిల్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్ మరోసారి సత్తా చాటాడు. వన్డేల్లో 5వ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో రాహుల్ 108 చేసి ఔటయ్యాడు. శ్రేయర్ స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ కూడు తుఫాన్ వేగంతో బ్యాటింగ్ చేశాడు. అతడి దూకుడు బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ బౌలర్ల కు చుక్కలు చూపించాడు. కేవలం 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు. పంత్ ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. ఇక చివర్లో హార్దిక్ పాండ్యా కూడా రఫాడించాడు. 16 బంతుల్లో 35 రన్స్ చేసి ఔటయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 66 రన్స్ చేశాడు. తొలి వన్డేలో భారత్ 66 రన్స్ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.