సిరీస్ పైనే మా ఫోకస్: రహానె
ఆస్ట్రేలియాను వారి గడ్డపై చిత్తు చేసి బోర్డర్-గావస్కర్ ట్రోఫీని డిఫెండ్ చేసుకున్న టీమిండియా ఫుల్ జోష్లో ఉంది. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్ కోసం ప్రస్తుతం కసరత్తులు చేస్తోంది. ఆసీస్పై సాధించిన విక్టరీతో జట్టు కాన్ఫిడెన్స్ పెరిగినప్పటికీ ఇంగ్లండ్ను ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోమని ఇండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానె అన్నాడు. చెపాక్ స్టేడియంలో బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ అనంతరం రహానె.. మీడియాతో వర్చువల్గా మాట్లాడాడు. ఇంగ్లండ్ సిరీస్ ప్రిపరేషన్స్ గురించి వివరించాడు. టీమ్ కాంబినేషన్పై గురువారం నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. ‘ఆస్ట్రేలియా సిరీస్ మాకు చాలా స్పెషల్. ఆ విక్టరీని చాలా ఎంజాయ్ చేశాం. అదంతా ఇక గతం. ప్రజెంట్ మూమెంట్లో ఉండటంపైనే అన్ని ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ సిరీస్ కోసం.. కచ్చితంగా చెప్పాలంటే నెక్స్ట్ మ్యాచ్ కోసమే ఆలోచిస్తున్నాం. ఇండియాలో వికెట్స్ ఎలా ఉంటాయో మాకు తెలుసు. మా టీమ్ బలమేంటో మాకు తెలుసు. అదే టైమ్లో ఇంగ్లండ్ టీమ్ను మేము లైట్ తీసుకోవడం లేదు. స్థాయికి తగ్గట్టు ఆడటంపై దృష్టి పెట్టాం. ఏ విషయాన్ని ఈజీగా తీసుకోము’ అని రహానె చెప్పాడు.