సర్వేపల్లిలో 33వ రోజు జనంకోసం జనసేన

సర్వేపల్లిలో నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం నందు సోమవారం 33వ రోజు జనంకోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నర సంవత్సరాలు అవుతుంటే గ్రామపంచాయతీలో నిధులు, కాలువల్లో బ్లీచింగ్ కొట్టిన పరిస్థితులు లేవు. దోమల బెడదతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేము అభివృద్ధి చేశాం అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఎక్కడ అభివృద్ధి చేశారో ఏం అభివృద్ధి చేశారు అనే విషయాన్ని స్పష్టంగా సచివాలయాల దగ్గర బోర్డులు వేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకి ఇల్లు కట్టిస్తున్న అని చెప్పి చెప్తున్నారు. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఇల్లు నిర్మాణం జరిగిన పరిస్థితుల్లో ఇంకొక ఆరు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి. ఆరు నెలల్లో ఇల్లు కట్టగలరా నాలుగున్నర సంవత్సరాల పేదవాడి సొంత ఇంటి కల నిర్మాణం చేయలేని ప్రభుత్వం ఆరు నెలల్లో ఏం చేయగలదు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. రాబోయేది జనసేన, కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే ఏది ఆగదు ప్రజలకి అండగా ఉంటూ రాష్ట అభివృద్ధి యువత భవిష్య లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత అధ్యక్షుడు ఖాజా రహమతుల్లా, పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షులు అశోక్, ఉపాధ్యక్షులు సుమన్, జనసేన నాయకులు శ్రీహరి, దినేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.