3వ రోజు జగనన్న ఇళ్ళు పేదల కన్నీళ్లు

రాజానగరం, కోరుకొండ గ్రామ సచివాలయంలో కె.రమేష్ బాబు పంచాయతీ సెక్రటరీని కలిసిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శ గంటా స్వరూప దేవి. జగనన్న ఇళ్ళు పేదల కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ గ్రామం ఎన్ని ఎకరాల్లో ఎన్ని ఇళ్ల స్థలాలు ఎక్కడ కేటాయించారు అనే విషయాల మీద సమాచారము కోసం జనసేన పార్టీ తరుపున వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోరుకొండ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పోసిబాబు, కోరుకొండ మండల జనసేన పార్టీ నాయకులు చదువు నాగు, చదువు ముక్తేశ్వరావు, కొచ్చర్ల బాబి, తెలగంశెట్టి శివ, రాజానగరం మండలం జనసేన పార్టీ యూత్ ప్రెసిడెంట్ సుంకర బాబ్జి మేడిద వీరబాబు తదితరులు పాల్గొన్నారు.