హౌసింగ్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతూ రిప్రజెంటేషన్ ఇచ్చిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా పిఠాపురం హౌసింగ్ బోర్డు కార్యాలయం ఎదుట పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ నిరసన తెలపడం జరిగింది మరియు రిప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 28 వేల మంది లబ్ధిదారులకు ఇల్లు కట్టి ఇచ్చామని ప్రభుత్వం చెబుతుంది అయితే ఈ ఇల్లు అన్ని ఎక్కడికి పోయాయని నేను అడుగుతున్నాను కనీసం మాకన్నా చెబితే ఆ ఇల్లులు జనసేన తరఫున ప్రజలకు మేమైనా చుపిస్తామని చెబుతున్నాము నాలుగు సంవత్సరాలుగా టిడ్కో ఇల్లు ఆల్మోస్ట్ పూర్తయిపోయి చిన్న చిన్న పనుల దగ్గర ఆగిపోయినట్టుంవంటి టిట్కో గృహలను పేద పేదవాళ్లకు అందించలేకపోయింది ఈ ప్రభుత్వం ఉన్న ఈ ఒక్క సంవత్సరం అయినా సరే యుద్ధ ప్రాతిపదికన చిన్న చిన్న పాలనా పూర్తి చేసి పేదవాడికి ఇళ్లను అందించవలసిందిగా పిఠాపురం జనసేన పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాను మీకు మీకు ఏమైనా ఉంటే పర్సనల్గా తీసుకోండి అమాయకమైన ప్రజలను ఇబ్బందులు పెట్టి కక్ష రాజకీయాలు చేయొద్దని డాక్టర్ శ్రీధర్ పిల్లా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది, అనంతరం హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉన్న ఏఈకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్కార నాయకులు కంబాల దాసు, కందరాడ ఎంపిటిసి పిల్లా సునీత, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు, పిల్లా దినేష్ మోటూరి మహేష్, వాకపల్లి సూర్యప్రకాష్, దుడ్డు రాంబాబు, గుర్రం గంగాధర్ బొండాడ జయరాజు పెన్ను పోతుల వీరబాబు, పలివెల నాని బాబు, అర్జెల నాగేంద్ర, కేసిరెడ్డి బుల్లి రాజు, కటారి తాతబ్బాయి, మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.