మెట్రో ఛార్జీల్లో 40 శాతం రాయితీ

దసరా సందర్భంగా హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు ఛార్జీల్లో రాయితీలు ప్రకటించింది మెట్రో. మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో 40 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. రేపట్నుంచి ఈ నెలాఖరు వరకు మెట్రో ఛార్జీల్లో రాయితీ వర్తిస్తుందని తెలిపారు. స్మార్ట్ కార్డు, ట్రిప్ కార్డుల ద్వారా 40 నుంచి 50 శాతం వరకు ప్రత్యేక రాయితీ కల్పించాలని నిర్ణయించామన్నారు. ట్రిప్ కార్డులపై రాయితీ రేపట్నుంచి మొదలుకుని సంక్రాంతి వరకు వర్తించనుంది అని స్పష్టం చేశారు. 40 శాతం రాయితీ కాకుండా ట్రిప్ కార్డులు కొన్నవారికి 2 నెలల వరకు రాయితీ ఉంటుందని స్పష్టం చేశారు.

ఆఫర్స్ వివరాలు 

14 ట్రిప్పుల ఛార్జీతో 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం.

20 ట్రిప్పుల ఛార్జీతో 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం.

40 ట్రిప్పుల ఛార్జీతో 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం.

7 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం. 30 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే 45 రోజుల్లో 45 ట్రిప్పులు తిరిగే అవకాశం