చెల్లూరులో 4వ రోజు ఇంటింటికీ జనసేన

మండపేట నియోజకవర్గం, రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో 4వ రోజు “ఇంటింటికీ జనసేన” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజల పక్షాన నిలబడే పార్టీ జనసేన పార్టీ అని ప్రతీ ఒక్కరు జనసేన పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తూ జనసేన పార్టీ కరపత్రం అందజేయడం జరిగింది. ప్రజల్లో మార్పు మొదలైందని ప్రతీ ఒక్కరు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఈ సందర్బంగా జనసైనికులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి దాలపర్తి శ్రీనివాస్, రాయవరం మండల అధ్యక్షులు వల్లూరి సత్య ప్రసాద్, ఎంపిటిసి గొల్లపల్లి అనురాధ వెంకటరమణ, తలాటం వెంకటేష్, ఆనంద్, రాజా, ప్రవీణ్, సురేంద్ర మరియు జనసైనికులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.