ఉమ్మడి దేవప్రసాద్ కుటుంబానికి 5లక్షల ప్రమాదభీమా చెక్కు అందజేత

తుని, తొండంగి మండలం, కొత్తపల్లి గ్రామానికి చెందిన ఉమ్మడి దేవప్రసాద్ అనే క్రియాశీల సభ్యుడు విద్యుత్ ప్రమాదంలో మరణించడం జరిగింది. గురువారం పీఏసీ సభ్యులు నాదెండ్ల మనోహర్ పర్యటన సందర్భంగా కాకినాడ ముత్తా క్లబ్ లో చెక్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ తొండంగి మండల అధ్యక్షుడు బెండపూడి నాయుడు, కొత్తపల్లి గ్రామ అధ్యక్షుడు చిన్న, మండల ఉపాధ్యక్షుడు ఖండవల్లి గణేష్, తుని ఐటి కో-ఆర్డినేటర్ బుసాల మణిబాబు, మండల ప్రధాన కార్యదర్శి వీరబాబు, నల్ల రాము రావికంపాడు గ్రామ అధ్యక్షుడు సిద్ధ కోటి సీనియర్ జనసైనికుడు శేషు, అయ్యప్ప, కాపు సంక్షేమసేన తొండంగి మండల యూత్ ప్రెసిడెంట్ గణేష్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.