జనసేన కార్యకర్త కుటుంబానికి 5లక్షల చెక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం, కమలాపురం గ్రామానికి చెందిన ముదిగొండ సాగర్ కుటుంబాన్ని ఆదివారం జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు పరామర్శించారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసేన పార్టీ కార్యకర్త ముదిగొండ సాగర్(22) కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేయించిన జనసేన పార్టీ ములకలపల్లి మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో 5 లక్షల రూపాయల చెక్ అందించిన జనసేన తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు నేమురి శంకర్ గౌడ్, గ్రేటర్ హైద్రాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం. అనంతరం రోడ్ ప్రమాదంలో గాయపడిన ప్రధాన కార్యదర్శి గొల్ల వీరభద్రంను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి మండల ఉపాధ్యక్షుడు పోడిచేటి చెన్నరావు, కందుకూరీ వినీత్ ప్రధాన కార్యదర్శి గొల్ల వీరభద్రం, సహాయ కార్యదర్శి బొక్క వెంకేశ్వర్లు, ఊకే నాగరాజు మాణితాల శివప్రసాద్, ఊకే ముత్యాలరావు, పండు, జిల్లా నాయకులు గరికే రాంబాబు, ఖమ్మం నాయకులు గుండ్ల పవన్ కళ్యాణ్, దేవేందర్, అశ్వారావుపేట నియోజకవర్గ ఇంచార్జి డెగల రామచంద్రరావు, దమ్మపేట మండల అధ్యక్షుడు అబ్దుల్ రహీమ్, చందు తదితరులు.