సిఐ రామ్ నాయక్ ను మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

పామూరు మండల నూతన సిఐ (సర్కిల్ ఇన్స్పెక్టర్)గా బాధ్యతలు చేపట్టిన రామ్ నాయక్ ను జనసేన నాయకులు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి యలమందల రహిముల్ల, జనసేన పార్టీ పామూరు మండల అధ్యక్షులు దర్శి ఏడుకొండలు, సీనియర్ నాయకులు గోస్టు, సునీల్ మరియు సంథాని, నుగుల నరసింహ రావు, నాని నాయుడు, బాందిల నారాయణ, పగడాల మల్లి, మధు, శ్రీహరి, మీర్జవలి జనసేన పార్టీ కార్యకర్తలు తదితరుల పాల్గొన్నారు.