జనం కోసం జనసేన 501వ రోజు

జగ్గంపేట, జనం కోసం జనసేన 501వ రోజులో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 100 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 73800 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క జనసైనికునికి, వీర మహిళకు పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా జె.కొత్తూరు గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన మానేపల్లి శివ కుటుంబ సభ్యులకు, ప్రత్తాడ శ్రీను కుటుంబ సభ్యులకు, వెలుగుల రాజు కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.