మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్‌లో 502 జాబ్స్

ఇండియన్‌ ఆర్మీలోని ఇంజినీరింగ్‌ విభాగమైన మిలటరీ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ (ఎంఈఎస్‌)లో ఖాళీగా ఉన్న 502 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా డ్రాఫ్ట్స్‌‌మ్యాన్‌, సూపర్‌వైజర్‌ బ్యారక్‌ స్టోర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఏప్రిల్‌ 12 లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (MES) నేపథ్యం:

ఇది కేంద్ర రక్షణ శాఖ పరిధిలో పనిచేసే ప్రముఖ కన్‌స్ట్రక్షన్ ఏజెన్సీ. సాయుధ బలగాలకు అంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, డీఆర్‌డీఓకు ఇంజనీరింగ్ సపోర్ట్ అందిస్తుంది. భారత ఆర్మీలో సేవలు అందించాలనుకునేవారికి ఇది కూడా ఓ మంచి అవకాశమే. సైన్యంలో కాకుండా ఇలాంటి సంస్థల్లో చేరడం ద్వారా సాయుధ బలగాలకు సేవలు అందించే అవకాశం దక్కుతుంది.

మొత్తం పోస్టులు: 502

డ్రాఫ్ట్‌మ్యాన్‌- 52

సూపర్‌వైజర్-‌ 450

ముఖ్య సమాచారం:

అర్హత: డ్రాఫ్ట్స్‌మెన్‌‌ పోస్టులకు ఆర్కిటెక్చురల్‌ అసిస్టెంట్‌షిప్‌లో మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి. సూపర్‌వైజర్‌ పోస్టులకు ఎకనమిక్స్‌, కామర్స్‌, స్టాటిస్టిక్స్‌, బిజినెస్‌ స్టడీస్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సుల్లో మాస్టర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: అభ్యర్థులు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో 50 శాతం మార్కులు తప్పనిసరిగా రావాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు రావాలి.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్‌, వైజాగ్‌.

అప్లికేషన్‌ ఫీజు: రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేదీ: ఏప్రిల్‌ 12, 2021

రాత పరీక్ష: మే 16, 2021

వెబ్‌సైట్‌:https://mes.gov.in/ లేదా https://www.mesgovonline.com/