జనంకోసం జనసేన 502వ రోజు

జగ్గంపేట, జనంకోసం జనసేన 502వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 200 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 74000 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అద్యక్షులు మరిశే రామకృష్ణ, జె.కొత్తూరు గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, గుండె రిషి కుమార్, గోపిశెట్టి వీరబాబు, నకిరెడ్డి నాగు, పడాల దుర్గ, అనుసూరి సతీష్, వెంటపాటి దుర్గ, గోనేడ నుండి వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు, జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా జె.కొత్తూరు గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన కాకర అర్జున కుటుంబ సభ్యులకు, వరిమాకుల సత్యవతి కుటుంబ సభ్యులకు, కాకర అనంతలక్ష్మి కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.