మల్లవరం గ్రామంలో జనం కోసం జనసేన 532వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనం కోసం జనసేన 532వ రోజులో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గోకవరం మండలం, మల్లవరం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 600 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 85060 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 533వ రోజు గురువారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు గోకవరం మండలం, మల్లవరం గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. బుధవరం జరిగిన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అద్యక్షులు మరిశే రామకృష్ణ, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి కొమరపు శివ, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి వట్టికూటి దుర్గాప్రసాద్, గోకవరం మండల సంయుక్త కార్యదర్శి పప్పల శ్రీను, మల్లవరం నుండి గ్రామ అధ్యక్షులు గంటా వీరబాబు, గ్రామ ఉపాధ్యక్షులు గోళ్ళ విజయ్, గ్రామ ఉపాధ్యక్షులు కర్ణం బుజ్జి, గ్రామ ప్రధాన కార్యదర్శి యలంశెట్టి వేణు, గ్రామ సంయుక్త కార్యదర్శి బొందల ఆంజనేయులు, పల్లెల ప్రసాద్(చిరు), కర్ణం ఆనంద్, సిగిరెడ్డి వీరబాబు, గుర్రం వీరవిష్ణు, కొత్తపల్లి నుండి మాదారపు ధర్మేంద్ర, శివరామపట్నం నుండి ములగడ ప్రసాద్, ములగడ జోషి గారికి, ములగడ సుజిన్, గాబు శంకర్, పీత గంగాధర, తోలేటి వీరబాబు, వెంగాయమ్మపురం నుండి కొట్టెటి నాగేశ్వరావు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.