జనసేన గిరిసేన 53వ రోజు

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, సీతంపేట మండలం, కుడ్డపల్లి పంచాయితీ, పులిగుమ్మి గ్రామంలో జనసేన గిరిసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన నేత సీనియర్ రాజకీయ నాయుకులు ఎక్స్ జడ్పిటిసి, పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ కర్త నిమ్మల నిబ్రమ్ మాట్లాడుతూ జనసేన టీడీపీ పొత్తులు విషయం పైన ఎవ్వరు ఎక్కడ ఎలా మాట్లాడిన మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయమే మాకు శిరోధార్యం అని తెలియజేయండీ. మాకు మా పాలకొండ నియోజకవర్గంలో మా ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం మాత్రమే మనం అందరం అలోచించాలి అని అక్కడ స్థానిక ప్రజలకి పాలకొండ జనసేన నాయుకులు నిబ్రమ్ గారు తెలియజేయడం జరిగింది. 2024లో ఖచ్చితంగా పాలకొండ నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలపించడానికి అందరం కలిసిగట్టుగా పనిచేయాలని నిబ్రమ్ పిలుపినివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు సవర సింహాద్రి, రాజేష్  మరియు భామిని మండలం నుండి కిషోర్ స్థానిక నాయకులు నిమ్మక రమేష్ ఎస్.రాజు ఎస్.దుర్గారావు పాల్గొన్నారు.