జనం కోసం జనసేన 556వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనం కోసం జనసేన 556వ రోజులో భాగంగా జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట మండలం కృష్ణాపురం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 350 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 92060 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 557వ రోజు ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి పేర్కొన్నారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల బి.సి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, కృష్ణాపురం నుండి అమరపల్లి శ్రీనివాస్, వెలిసెట్టి ఆనంద్, గౌడు సూరిబాబు, దిగుమర్తి దుర్గాప్రసాద్, రాజనాల దుర్గాప్రసాద్, కోన వీరబాబు, గోపిసెట్టి దయానిధి, బల్లిన సతిష్, బాలెం మణికంఠ స్వామి, గోకాడ మురళి కృష్ణ, కొల్లుమళ్ళ తేజ, కోన రవికుమార్, రాజనాల గంగా సోమరాజు, పిల్లా రాజు, బొద్దపు చక్రరావు, నీలంశెట్టి సత్యనారాయణ గారికి, ద్వారపూడి శ్రీనివాస్ గారికి, బల్లిన శివ, పిల్లా రంజిత్, గొర్రెల అప్పలరాజు, అప్పాన హరి తేజ, రాజపూడి నుండి గ్రామ అధ్యక్షులు కిలాని శివాజీ, మల్లేపల్లి నుండి రెడ్డి ప్రసాద్, గోనేడ నుండి వల్లపుశెట్టి నానిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర శ్రీపవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్రలో పాల్గొంటారు, పాటంశెట్టి శ్రీదేవి నియోజకవర్గంలో జనం కోసం జనసేన కార్యక్రమం కొనసాగిస్తారు.