జనం కోసం జనసేన మహాయజ్ఞం 648వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 648వ రోజు కార్యక్రమం ఆదివారం గోకవరం మండలం, మల్లవరం గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 649వ రోజు కార్యక్రమం సోమవారం గోకవరం మండలం, శివరామపట్నం గ్రామంలో మరియు గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల సంయుక్త కార్యదర్శి పప్పల శ్రీను, మల్లవరం గ్రామ అధ్యక్షులు గంటా వీరబాబు (జి.వి నాయుడు), గుమ్మాల సురేష్, కర్ణం బుజ్జి, గుండు అశోక్, బొందల ఆంజనేయులు, చింతపల్లి మౌళి, బొద్దపు నాగు, యలంశెట్టి వేణు, గుర్రం వీరవిష్ణు, కొట్టే శివ శంకర్, తోట సత్య, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని లకు కృతజ్ఞతలు తెలిపారు.