జనసైనికుడి ఆకాంక్ష నెరవేర్చిన పవన్ కళ్యాణ్

తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నియోజకవర్గం, రామేశ్వరం గ్రామానికి చెందిన జనసైనికుడు కొటికలపూడి సత్తిబాబు ఇటీవల గొంతు క్యాన్సర్ బారినపడి మృత్యువుతో పోరాడుతున్నాడు. జనసేన పార్టీ క్రియాశీలకంగా పనిచేసిన సత్తిబాబు. ఎప్పటి నుంచో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని కలిసి ఆయనతో మాట్లాడాలని ఆశపడ్డారు. ఆ కోరిక తీరకుండానే తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు. ఈ విషయాన్ని నియోజకవర్గ నాయకులు, జనసేన కార్యకర్తల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో సత్తిబాబును కలిసి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తన కుటుంబ సభ్యులు సత్తిబాబును పవన్ కళ్యాణ్ కలిసేలా చేసిన జనసేన పార్టీ మీడియా ఇంచార్జ్ పి. హరి ప్రసాద్ , నియోజకవర్గ ఇంచార్జ్ లకు, జడ్పీటీసీ అభ్యర్థినికి, నాయకులకు, తోటి జనసైనికులందరికీ ప్రతీ ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరిచారు.