జనం కోసం జనసేన మహాయజ్ఞం 653వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 653వ రోజు కార్యక్రమం శుక్రవారం గోకవరం మండలం, కొత్తపల్లి గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 654వ రోజు కార్యక్రమం శనివారం గోకవరం మండలం, కృష్ణుని పాలెం, తంటికొండ మరియు సాయంత్రం గోకవరం మండలం, రంప యర్రంపాలెం గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, గోకవరం మండల ఉపాధ్యక్షులు వేముల రమణ మూర్తి, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, గోకవరం మండల ప్రధాన కార్యదర్శి అల్లాడ త్రిలోక్ కుమార్, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి వెంకట సూర్యారావు గారికి, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు గారికి, కొత్తపల్లి నుండి గ్రామ అధ్యక్షులు సొలా అంజిబాబు గారికి, పువ్వుల శ్రీదేవీ, వేముల దేవి, వేముల శ్రావణి దేవి, పల్లా భవాని, నక్కా కుమారి, జల్లూరి శ్రీను, చేదులూరి సతీష్, వనం ప్రదీప్ గారికి, మధారపు ధర్మేంద్ర, మిరియాల శివ, తలారి అప్పలరాజు, దవరసింగ్ వెంకటేష్, కూనిశెట్టి రాజా, వీరలంకపల్లి నుండి గ్రామ అధ్యక్షులు మామిడిపల్లి నాగేశ్వరరావు, గుమ్మళ్ళదొడ్డి నుండి స్వయం నాగదేవి, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, పుగమళ్ళ పెద్దకాపు, అయితిరెడ్డి ఏసుబాబు, అడబాల శ్రీరామ్, మల్లిసాల నుండి బండారి చిన్నా, ఆచంట ప్రసాద్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు కృతజ్ఞతలు తెలిపారు.